మహేష్‌తో సినిమా కోసం కీరవాణిని రాజమౌళి పక్కన పెడతాడా.?

ఎస్ఎస్‌ రాజమౌళి ఆస్తాన విద్వాంసుడు ఎంఎం కీరవాణి.! ఇది అందరికీ తెలిసిన విషయమే. విజయేంద్ర ప్రసాద్ కథ అందించాలి, కీరవాణి సంగీతం అందించాలి.. ఇలా రాజమౌళి తనకంటూ ఖచ్చితమైన లెక్కలతో వుంటాడు. ప్రొడక్షన్ దగ్గర్నుంచి, సినిమాకి సంబంధించి అన్నింట్లోనూ తాను, తన కుటుంబ సభ్యుల పూర్తి ఇన్వాల్వ్‌మెంట్ వుండేలా చూసుకోవడం ఎస్ఎస్ రాజమౌళి ప్రత్యేకత.

కానీ, సూపర్ స్టార్ మహేష్‌బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించి చాలా మార్పులు వుండబోతున్నాయట. అసలు కీరవాణి సంగీతం అందించబోడట.! ఇది నిజంగానే చాలా షాకింగ్ విషయం. నిప్పు లేకుండా కూడా సినీ పరిశ్రమలో పొగ వచ్చేస్తుంటుంది. ఇది కూడా అలాంటిదేనా.?

గ్లోబ్ ట్రోటింగ్ కాన్సెప్ట్‌తో మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. సినిమాటోగ్రఫీ సహా పలు కీలక విభాగాల్లో మార్పులు వుండబోతున్నాయట.. టీమ్‌లో ఈ మార్పులు స్వయంగా రాజమౌళి కోరుకున్నవేనట.

సంగీతం విషయంలోనూ ‘మార్పు’ ఆలోచన జరుగుతోందనీ, అయితే కీరవాణి సేవల్ని ఇంకో రకంగా రాజమౌళి వినియోగించుకుంటాడనీ అంటున్నారు. కీరవాణి పాటే కదా, ఆస్కార్ గెలుచుకున్నది.? అంటే, కాదని ఎలా అనగలం.? కానీ, మార్పు తప్పదని అంటున్నారు. నిజమేనా.?