టాలీవుడ్లో స్టార్ హీరోలు రాజమౌళి సినిమాల్లో ఉన్నప్పుడు పూర్తిగా ఆ ప్రాజెక్ట్లోనే లీనమై పోతారు. ఇది రాజమౌళి పెట్టిన కండీషన్ కాకపోయినా, ఆయన సినిమాల గ్రాండియర్ వలన, పని పద్ధతులు హీరోలను వేరే ప్రాజెక్ట్ల నుంచి దూరం చేస్తాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 కోసం శారీరక, మానసికంగా పూర్తిగా డివోట్ అయ్యాడు. మధ్యలో వేసవి విరామం తీసుకున్నా, త్వరలో తిరిగి షూటింగ్లో జంప్ అవ్వాల్సిన పని ఉంది.
ఇక రూమర్లలో బుచ్చిబాబు-మహేష్ కలయిక గురించి చర్చలు హాట్గా నడుస్తున్నాయి. బుచ్చిబాబు మహేష్కి లైన్ వినిపించాడట, డెవలప్మెంట్ జరగుతోందట అన్నది టాక్. కానీ ఇది నిజం కాదని తెలుస్తోంది. బుచ్చిబాబు ప్రస్తుతం పెద్ది ప్రాజెక్ట్తో బిజీగా ఉండగా, అది తనకు లైఫ్ టైమ్ అవకాశమని భావించి ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మహేష్కి కథలు చెప్పే సమయం ఆయన దగ్గరే లేదు.
అదే విధంగా మహేష్ బాబు పరిస్థితి చూస్తే కూడా బుచ్చిబాబుని కలిసే పరిస్థితి కనిపించదు. ఎస్ఎస్ఎంబి 29కి కనీసం రెండు సంవత్సరాల పాటు సమయం పడుతుందనే అంచనా. పైగా ఈ సినిమా ఒక భాగం మాత్రమేనా, లేక సీక్వెల్ ఉంటుందా అనే విషయాలు ఇంకా క్లారిటీకి రాలేదు. ఇంత కఠినమైన షెడ్యూల్లో మహేష్ వేరే ప్రాజెక్ట్లపై దృష్టి పెట్టడం అసంభవం. రెండు వైపులా కూడా వాస్తవాలు అడ్డంకిగా ఉంటే, ఇలాంటి గాసిప్స్ ఎలా పుట్టుకొస్తాయో ఎవరికీ అర్థం కాదు. ప్రస్తుతానికి అభిమానులు ఈ రూమర్లను లైట్గా తీసుకోవడం మంచిదని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి.