Mahesh Babu: సర్కారు వారి పాట సినిమా లీకుల మీద ఫైర్ అవుతున్న మహేష్..!

Mahesh Babu : సర్కారు వారి పాట సినిమాగురించి మహేష్ ఎక్కువ కలవరపడుతున్నారేమో అనిపిస్తుంది. దీనికి కారణం లీకులే. ప్రతి సినిమా కు ఇంతకు ముందు పైరసీ భయం సినిమా విడుదల తర్వాత వచ్చేది. ఇపుడు సినిమా షూటింగ్ జీ సమయంలోనే లీకులు ఎక్కువవ్వడం వల్ల చిత్ర బృందలు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయం లో ఈ లీకుల వల్ల సమస్యలు ఎక్కువయ్యాయి.

ఇక సర్కారు వారి పాట సినిమాకు తప్పలేదు లీకుల తిప్పలు. సర్కారు వారి పాటనుండి కళావతి సాంగ్ ను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ అనుకోగానే నెట్టింట్లో ముందే దర్శనమిచ్చి చిత్ర యూనిట్ ను షాక్ కు గురిచేసింది. అపుడప్పుడు షూటింగ్ విజువల్స్ ను కూడా సామాజిక మధ్యమాల్లో పెడుతూ చిత్ర యూనిట్ ను కలవరపెడుతున్నారు.

ఇక ఎపుడు సర్కారు వారి పాట నుండి మరో పాటను విడుదల చేయాలనీ భావించిన చిత్ర యూనిట్ విడుదల తేదీ అప్ డేట్ ను ప్రకటించారు. అయితే అందులో ఉన్న ఇంకో సర్‌ప్రైజ్ ను చెప్పలేదు. కానీ ఇపుడు ఆ వార్త కూడా లీక్ అయిపోయింది. మహేష్ బాబు కూతురు సితార ఈ పాటలో కనిపించనుంది అని అప్పుడే వార్తలు సామాజిక మధ్యమాలలో దర్శనమిస్తున్నాయి. దీంతో సర్కారు వారి పాట సినిమా చిత్ర బృందం మరోసారి షాక్ కు గురైయంది. దీనిపై మహేష్ బాబు కూడా గుర్రుగానే ఉన్నాడ‌ని టాక్‌. క‌ళావ‌తీ పాట ముందే లీక‌యిన‌ప్పుడు మ‌హేష్ ఫైర్ అయిపోయాడని దానికి నిర్మాత‌లు సైతం స‌మాధానం చెప్ప‌లేక‌పోయార‌ని టాక్‌. పాట లీక‌వ్వ‌డం ఒక్క‌టే కాదు. అసలు సినిమాకి సంబంధించిన అన్ని విష‌యాలూ ముందే బ‌య‌ట‌కు ఎలా వెళ్తున్నాయ‌ని.. మ‌హేష్ కొంచెం గ‌ట్టిగానే అడిగాడ‌ట‌. ఇక నుంచి…అప్ డేట్లు ఇచ్చే విషయంలో జాగ్ర‌త్త‌గా ఉంటామ‌ని నిర్మాత‌లు స‌ర్ది చెప్పార‌ని తెలుస్తోంది. ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మ‌హేష్ చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాడు. త‌న‌కంటూ ఓ స్ట్రాట‌జీ ఉంటుంది. స‌ర్కారు వారి పాట విష‌యంలో అది మిస్ అవుతోంది. అందుకే మ‌హేష్ ఇంత హైరానా ప‌డుతున్నాడు. ఈ విష‌యంలో మైత్రీ… ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.