Rajamouli & Mahesh Babu : దుబాయ్ కి పోయిన రాజమౌళి, మహేష్…. సినిమా కథ చర్చల గురించే అంటూ టాక్….!

Rajamouli & Mahesh Babu : రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయిందో అందరు చూసారు. ఇక ఆర్ఆర్ఆర్ గురించిన మీడియా సమావేశాల్లో పాల్గొంటున్న రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ తో తీయబోయే సినిమాగురించి కూడా వివరాలను చెప్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో తాను చేయబోతున్న సినిమా భారీ యాక్షన్ సాహస వీరుడి మూవీ అంటూ ప్రకటించాడు. ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే భారీ ఎంటర్ టైనర్ గా ఆ సినిమా ఉండబోతుంది అన్నట్లుగా జక్కన్న ప్రకటించాడు.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారూ ఈ సినిమా స్క్రిప్ట్ పనులని మొదలుపెట్టారు. సినిమా స్క్రిప్ట్ పనిని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇక రాజమౌళి కూడా అన్ని వైపులా విమర్శలు రావడంతో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. అందుకే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకుని షూటింగ్ సమయం తగ్గించాలని అనుకుంటున్నారట.

ఇక అభిమానులు మాత్రం సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ ను అస్సలు మిస్ అవ్వడం లేదు. రీసెంట్ గా రాజమౌళి దుబాయ్ కి వెళ్లారు. ఇక మహేష్ కూడా అదే సమయంలో దుబాయ్ లో ఉండటంతో ఇక సినిమా కథా చర్చల కోసమే అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇక అసలు విషయానికి వస్తే రాజమౌళి తన కుటుంబంతో కలిసి దుబాయ్ కు విహారయాత్రకు వెళ్లారు. ఇక మహేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తవడంతో పారిస్ కు ఫ్యామిలీ తో చేక్కేసారు. ఎలా వాళ్లు దుబాయ్ లో కలిశారు కానీ కథ గురించిన మీటింగ్ అంటూ ఫ్యాన్స్ మాత్రం ఏవేవో అనుకుంటున్నారు.