కియారాకు ల్కకీఛాన్స్‌!

రామ్‌ చరణ్‌తో ‘గేమ్‌ చెంజర్‌’ సినిమా చేస్తున్న బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ ఇప్పుడు మరో పెద్ద ఛాన్స్‌ కొట్టేసింది. దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ తీయబోయే ‘డాన్‌ 3’ సినిమాలో కియారా అద్వానీ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇందులో రణవీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తుండగా, అతనికి జోడీగా కియారా అద్వానీ చేస్తున్నట్టుగా చిత్ర నిర్వాహకులు ప్రకటించారు. ఇది ఇంతకు ముందు తీసిన ‘డాన్‌’ సినిమాకి రెండో సీక్వెల్‌ గా రావటం విశేషం.

దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ సామాజిక మాధ్యమం ద్వారా ఈ విషయాన్ని చెబుతూ, మా ‘డాన్‌’ యూనివర్స్‌కి స్వాగతం అంటూ కియారా అద్వానీకి వెల్కమ్ చెప్పారు. కియారా మొదటిసారిగా రణవీర్‌సింగ్‌తో ఈ సినిమాలో నటిస్తున్నారు, ఇంతకు ముందు ఆమె రణవీర్‌ సింగ్‌ తో చెయ్యలేదు.

ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలలో షారుఖ్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా నటించారు, ఇప్పుడు రణవీర్‌ సింగ్‌ ఈ మూడో సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్‌ సినిమాగా తెరకెక్కనుందని అంటున్నారు, ఇందులో కియారా అద్వానీ యాక్షన్‌ పాత్రలో కనిపించ నున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కియారా ఇంకో యాక్షన్‌ సినిమాలో కూడా నటిస్తున్నారు.

హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిపి నటిస్తున్న ‘వార్‌ 2’లో కూడా కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇంతవరకు యాక్షన్‌ పాత్రలు చెయ్యని కియారా ఇప్పుడు ఈ ‘డాన్‌ 3’,’వార్‌ 2’ లతో, యాక్షన్‌ జానర్‌లో కూడా తన ప్రతిభ చూపించుకోవడానికే అవకాశం దక్కింది. అలాగే తెలుగులో ‘గేమ్‌ చెంజర్‌’ లో రామ్‌ చరణ్‌ కు జోడీగా నటిస్తోంది. దీనికి శంకర్‌ దర్శకుడు. ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదలకానుంది.