‘గుంటూరు కారం’ నుంచి లీకైక మసాలా బీర్యానీ పాట!

మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’ నుండి ఒక పాట లీక్‌ అయింది. సాంఫీుక మాధ్యమంలో ఈ పాటలో ఒక చిన్న బిట్‌ వైరల్‌ అవుతోంది. ఈ సినిమాకి థమన్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. ఎందుకో ఈ సినిమా మొదలైన దగ్గరనుంచీ వార్తల్లో ఉంటూ వస్తోంది. షూటింగ్‌ చాలాసార్లు పోస్టుపోన్‌ అవటం, మధ్యలో కథానాయకురాలి మారటం, తరువాత ఛాయాగ్రహకుడు మారిపోవటం, ఇలా ఈ సినిమా వార్తల్లో ఉంటూ వస్తోంది.

మహేష్‌ బాబు అభిమానులు ఈ సినిమా నుండి ఎప్పుడు మొదటి పాట విడుదలవుతుందా అని ఎదురుచూస్తూ వున్న సమయంలో ఇందులోంచి ఒక పాట లీక్‌ అవటం, అందులో ఒక బిట్‌ వైరల్‌ అవటంతో మళ్ళీ ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకి సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత, శ్రీలీల, విూనాక్షి చౌదరి కథానాయికలు కాగా, ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్‌, రావు రమేష్‌, మురళి శర్మ ఇంకా చాలామంది నటులు వున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్‌ పుట్టినరోజు ఈనెల 7వ తేదీన ఈ సినిమా నుండి ఏదైనా ఒకటి విడుదల చెయ్యాలని చిత్ర నిర్వాహకులు అనుకున్నారు, అందులో పాట అయితే బాగుంటుంది అని కూడా అనుకున్నారు. ఇంతలోపే ఇలా లీక్‌ అవటంతో ఈ పాటనే 7వ తేదీన విడుదల చేయొచ్చు అని కూడా ఒక వార్త నడుస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్‌ ఈ ‘గుంటూరు కారం’ లో ఓ పాట పాడాడు. ఇప్పుడు లీక్‌ అయిన పాట ‘మసాలా బిర్యానీ’ అనేది అతను పాడిరదే. అయితే ఇలా లీక్‌ అయిన పాట ‘మసాలా బిర్యానీ’ బావుందని మహేష్‌ బాబు అభిమానులు అంటున్నారు.