బిగ్ అప్డేట్ – ఓటిటిలో “వీరసింహా రెడ్డి” విహారంకి టైం ఫిక్స్డ్.!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అవైటెడ్ మాస్ చిత్రం “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి. కాగా ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే నెవర్ బిఫోర్ హైప్ తో వచ్చి మొదటి రోజే 50 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టి సెన్సేషన్ ని సెట్ చేసింది.

ఇక తర్వాత నెమ్మదిగా స్లో అయ్యింది కానీ సినిమా మాత్రం పెద్దగా నెగిటివిటి తెచ్చుకోలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి లో ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధం అయ్యింది. మరి ఈ సినిమా తాలూకా డిజిటల్ హక్కులు హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ అఖండ తర్వాత ఈ సినిమాని వారు ఫ్యాన్సీ రేట్ ఇచ్చి కొనుగోలు చేయగా..

ఇందులో ఈ సినిమా ఎప్పుడు నుంచి అందుబాటులోకి వస్తుందో అఫీషియల్ అప్డేట్ ఇచ్చేసారు. దాని ప్రకారం అయితే ఈ మాస్ బ్లాస్టర్ వీరసింహా రెడ్డి విహారం ఈ ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటల సమయం నుంచి ఉంటుందని ఖరారు చేశారు. దీనితో చాల రోజు లు నుంచి ఎదురు చూస్తున్న ఈ అవైటెడ్ అప్డేట్ బయటకి వచ్చింది.

కాగా ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే దునియా విజయ్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటించారు అలాగే థమన్ సంగీతం సమకూర్చగా మైత్రి మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు.