లేటెస్ట్ : “ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వాటిలో మాస్ చిత్రం దర్శకుడు హరీష్ శంకర్ తో అయితే చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ఒక్క షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అయితే ఈ చిత్రం నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు నేడు ఇప్పటివరకు పవన్ వారాహి యాత్ర అలాగే మరో చిత్రం ఓజి కి ఎక్కువ స్పేస్ ఇవ్వడంతో ఎలాంటి పత్తా లేకుండా పోయింది.

కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ పై మేకర్స్ క్రేజీ అప్డేట్ ని మరింత హైప్ ని ఎక్కిస్తూ అదిరే పోస్టర్స్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్స్ లో మేకర్స్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే అప్పట్లో గబ్బర్ సింగ్ కి పవన్ మరియు హరీష్ శంకర్ లు పై వర్కింగ్ స్టిల్స్ ని రిలీజ్ చేసారు.

అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ ని ఇప్పుడు నుంచి రీస్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ మొదలవుతుంది. కాగా ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.