“వార్ 2” పై సెన్సేషన్ గా మారిన లేటెస్ట్ టాక్..!

బాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర ఉన్న కొన్ని ఎపిక్ హిస్టారికల్ హిట్స్ చిత్రాల్లో బాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా టైగర్ ష్రాఫ్ కూడా ప్రధాన పాత్రలో నటించిన భారీ ఏక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వార్” కూడా ఒకటి. కాగా అప్పటికే హృతిక్ సరైన హిట్ కోసం చూస్తుండగా ఈ భారీ సినిమా అయితే అప్పట్లో సంచలన విజయాన్ని బాలీవుడ్ లో నమోదు చేసింది.

అంతే కాకుండా మన టాలీవుడ్ నుంచి సాహో బాలీవుడ్ నుంచి వార్ చిత్రాలకి అయితే పెద్ద యుద్ధమే నడిచింది. ఏది ఇండియాస్ బిగ్గెస్ట్ ఏక్షన్ ఎంటర్టైనర్ అన్నట్టుగా అంతా ఓ రేంజ్ లో హైప్ తెచ్చుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు సిద్ధం చేస్తుండగా ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ(బ్రహ్మాస్త్ర) ఫేమ్ తెరకెక్కిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో హృతిక్ రోషన్ తో పాటుగా మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించనున్నాడని ఫిక్స్ అయ్యింది. ఆల్రెడీ ఎన్టీఆర్ సహా హృతిక్ లు కూడా యుద్ధ భూమిలో కలుసుకుందాం అంటూ ఫ్యాన్స్ కి కూడా ఓ రేంజ్ లో కిక్ ఇచ్చారు.

దీనితో నార్త్ నుంచి సౌత్ వరకు సెన్సేషనల్ అంచనాలు రేగగా ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ అయితే సినీ వర్గాలని ఊపేస్తోంది. మరి ఈ భారీ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ మోస్ట్ చివరికి వచ్చేశాయట. అంతే కాకుండా ఎన్టీఆర్ ని అయితే దర్శకుడు అయాన్ ఈరోజు హైదరాబాద్ లో కలిసాడు అని కలిసి షూట్ ఎప్పుడు ఏంటి అనేవి మాట్లాడుకున్నారని తెలుస్తుంది.

అంతే కాకుండా ఎన్టీఆర్ అయితే ఇప్పుడు చేస్తున్న దేవర షూట్ కంప్లీట్ అయ్యిన వెంటనే వార్ 2 లో దిగిపోతాడట. తన షూటింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లోకి తాను రానున్నాడు అని టాక్. మొత్తానికి అయితే ఇప్పుడు వార్ 2 అప్డేట్ మాత్రం సినీ వర్గాల్లో ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.