లేటెస్ట్ : షాకింగ్ డెసిషన్ తీసుకున్న సమంత.!

సౌత్ ఇండియా సినిమా దగ్గర సెకండ్ హీరోయిన్ గా కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన సమంత ఇపుడు ఆమెకి అంటూ సెపరేట్ మార్కెట్ ని అయితే సెట్ చేసుకుంది. అంతే కాకుండా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కూడా ఆమె చేస్తుండగా రీసెంట్ గానే మొదటి పాన్ ఇండియా “యశోద” తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోగా రెండో సినిమా “శాకుంతలం” తో కెరీర్ భారీ డిజాస్టర్ ని కూడా సొంతం చేసుకుంది.

అయితే ఇప్పుడు సమంత షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా పలు వార్తలు ఇపుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సమంత ఇపుడు తన సినిమాలు అయితే ఒక ఏడాది పాటు ఆపేయాలని డిసైడ్ అయ్యిందట. ఆమె ఇపుడు చేస్తున్న ఖుషి ఇతర వెబ్ సిరీస్ లు షూటింగ్ కంప్లీట్ అయ్యాక అయితే ఈ ఏడాది బ్రేక్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

కాగా సమంత అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇది వరకే తీసుకున్న అడ్వాన్స్ లు అన్నీ కూడా మళ్ళీ తన నిర్మాతలకు వెనక్కి కూడా పంపేసింది అని కూడా తెలుస్తుంది. అయితే అసలు సమంత ఎందుకు సడెన్ గా ఏడాది గ్యాప్ కోరుకుంటుంది అంటే ఆమె తనకి ఉన్న మాయోసైటిస్(కండరాల సంబంధిత వ్యాధి) కి చికిత్స కోసమే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఈ ఏడాది సమయం ఖచ్చితంగా తన ట్రీట్మెంట్ కి కేటాయిస్తే తప్ప సమంత మళ్ళీ ముందు మనిషిలా అయితే కోలుకోలేదు అని అందుకే ఇప్పుడు ఆమె ఏడాది గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యిందని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. సో ఇప్పుడు చేతిలో ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ లు కంప్లీట్ అవ్వడానికి ఎలాగో సమయం పడుతుంది. దీనితో మళ్ళీ సమంత ని 2025 లోనే బిగ్ స్క్రీన్స్ పై చూస్తాం కాబోలు.