ఇన్సైడ్ రిపోర్ట్స్ : “గుంటూరు కారం” అప్పటి హిస్టరీ రిపీట్ చేస్తుందట

ప్రెజెంట్ టాలీవుడ్ దగ్గర ఉన్న మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ చిత్రాల్లో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్నా హ్యాట్రిక్ సినిమా “గుంటూరు కారం” కూడా ఒకటి.  కాగా ఈ చిత్రం వీరి నుంచి రెండు క్లాసిక్ హిట్ చిత్రాలు తర్వాత వస్తుడడంతో చాలా క్రేజ్ నెలకొంది.

ఇక ఈసారి ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా ఇది కావడం మరిన్ని అంచనాలు సెట్ చేసింది. ఐతే ఈ చిత్రానికి మొదటి నుంచి కూడా చాలానే డ్రామా నడిచింది. దీనితో ఈ చిత్రం సుమారు రెండేళ్ల నుంచి షూటింగ్ దశలోనే ఉండిపోయింది.

అయితే ఫైనల్ గా అన్నీ సెట్ చేసుకుని మేకర్స్ ఇప్పుడు ఓ సాలిడ్ ప్రొడెక్టు ని అందిస్తున్నారని సినీ వర్గాల నుంచి ఇపుడు విశ్వసనీయ వర్గాల సమాచారం. మహేష్ కాంపౌండ్ సహా చిత్ర యూనిట్ నుంచి ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇపుడు చిత్రం అవుట్ పుట్ చాలా అద్భుతంగా వస్తుందట.

దీనితో వారు చెప్పిన మాట ప్రకారమే మహేష్ బాబు 2003 లో వచ్చిన “ఒక్కడు” సంక్రాంతికి ఏ రేంజ్ హిట్ ని సాధించిందో అన్ని సెట్ అయ్యి గుంటూరు కారం 2024 లో వచ్చి మళ్ళీ అదే హిస్టరీ క్రియేట్ చేస్తుంది అని అంటున్నారట. దీనితో గుంటూరు కారం పై ఇప్పుడు మరిన్ని అంచనాలు నెలకొన్నాయని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారిక హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.