ఇన్సైడ్ టాక్ : మెగాస్టార్ మళ్ళీ వాయిదా..?

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య” అలాగే నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన “వీరసింహా రెడ్డి” చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. అయితే గత 2017లో కూడా ఈ ఇద్దరు స్టార్స్ తమ ప్రతిష్టాత్మక చిత్రాలతో రాగ..

అందులో మెగాస్టార్ దే పైచేయి కాగా ఈసారి కూడా మెగాస్టార్ అయితే వార్ వన్ సైడ్ చేశారు. దీనితో వాల్తేరు వీరయ్య ఇచ్చిన బూస్టప్ తో తన నెక్స్ట్ సినిమా అందులోని రీమేక్ అయ్యినటువంటి “భోళా శంకర్” కి మంచి ప్లస్ అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా కూడా శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

ఇదిలా ఉండగా నిజానికి ఈ సినిమా ఈ ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మేకర్స్ ఈ ఏప్రిల్ నుంచి వాయిదా వేసి ఆగష్టు 11కి ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ ఇన్సైడ్ టాక్ ఏమిటంటే బహుశా భోళా శంకర్ ఈ డేట్ లో కూడా రాకపోవచ్చని తెలుస్తుంది. దీనితో భోళా శంకర్ కొత్త డేట్ కి వస్తాడనే ఊహాగానాలు ఇపుడు మొదలయ్యాయి.

ఇక కొత్త డేట్ ఏంటి అనేది చూడాలి. కాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా చిరు సరసన మరోసారి హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు కి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. అలాగే మహతి సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.