ధనుష్, నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం కుబేరాపై ఫిలిం సర్కిల్స్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ 20న థియేటర్లలోకి రావాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీపై ఆడియన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి.
సినిమాకు సంబంధించి చివరి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఫైనల్ ఎడిటింగ్ పూర్తికాగానే దేవిశ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. ఇటీవల విడుదలైన “పోయిరా మామ” సాంగ్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మేకర్స్ త్వరలోనే మరిన్ని సాంగ్స్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఇక బడ్జెట్ విషయానికొస్తే.. సినిమాకు అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చు అయినట్లు టాక్. ప్రముఖ నటుల పారితోషికాలు, టెక్నికల్ టీమ్ ఖర్చులు, ఇతర విభాగాల్లో వ్యయం పెరిగి మొత్తంగా రూ.100 కోట్లకు చేరినట్టు సమాచారం. అయితే సినిమా బిజినెస్ పరంగా మేకర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది తాజా సమాచారం. ఇప్పటికే హిందీ డబ్బింగ్, డిజిటల్, ఓటీటీ, ఆడియో రైట్స్ ద్వారా బడ్జెట్లో 30 శాతం రాబట్టినట్టు తెలుస్తోంది.
తెలుగు, తమిళ థియేట్రికల్ రైట్స్ డీల్స్ ఇంకా ఖరారవ్వకపోయినా.. వాటికి భారీ పోటీ ఉన్నట్టు సమాచారం. దీంతో మూవీ రిలీజ్కు ముందే సేఫ్ జోన్లో ఉందన్న వార్తలు ఫిలిం సర్కిల్లో హల్చల్ చేస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్గా కనిపిస్తున్న ఈ సినిమాలో జిమ్ సెర్బ్, దలీప్ తహిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఇక కుబేరా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.