సినిమా హిట్ కొట్టాలని గుడిలో ప్రత్యేక పూజలు చేసిన కృతి శెట్టి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీలు పెద్ద ఎత్తున దైవ దర్శనాలు చేస్తూ వారిలో ఉన్న దైవభక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే కన్నడ సోయగం కృతి శెట్టి మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఉప్పెన సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయమందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. అయితే ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇలా ఈమె నటించిన వరుస సినిమాలు హిట్ కావడంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఇండస్ట్రీలో డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైన కృతి శెట్టి ఈ సినిమా హిట్ కావడంతో ఏకంగా తెలుగు తమిళ భాషలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు.ఈ క్రమంలోనే లింగు స్వామి దర్శకత్వంలో ఈమె నటించిన దివారియర్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదని చెప్పాలి అలాగే నితిన్ సరసన నటించిన మాచర్ల నియోజకవర్గం కూడా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇలా వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో కృతి శెట్టికి కెరియర్ పట్ల భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుదీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈమె తన తల్లితో కలిసి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక త్వరలోనే విడుదల కాబోయే సినిమా హిట్ అయితే స్వామివారికి వెండి కిరీటం చేయిస్తానని ఈ హీరోయిన్ మొక్కుకున్నారట. మరి స్వామివారు కృతి శెట్టి మొక్కు తీరుస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.