చెల్లెలి విషయంలో అక్క అతి జాగ్రత్త.!

‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో నుపుర్ సనన్ తెలుగు తెరకు పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కృతి సనన్ చెల్లెలే ఈ నుపుర్ సనన్ అన్న సంగతి తెలిసిందే.

అయితే, టాలీవుడ్‌లో కృతి సనన్‌కి అంత ఆదరణ దక్కలేదు. బాలీవుడ్‌లో మాత్రం ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది కృతి సనన్. తనకు దక్కనిది.. కనీసం చెల్లెలికైనా దక్కాలని అనుకుంటోందట. టాలీవుడ్‌లో తాను స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

కనీసం చెల్లెలైనా స్టార్ స్టేటస్ దక్కించుకోవాలని కృతి సనన్ తంటాలు పడుతున్నట్లుంది. చెల్లెలికి సంబంధించిన అన్ని విషయాల్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. హోటల్ స్టే దగ్గర నుండి ఫుడ్ వరకూ అన్నీ ఆరా తీస్తోంది కృతి సనన్.

అలాగే, తదుపరి చేయబోయే ప్రాజెక్టుల విషయంలోనూ కృతి సనన్ కేర్ తీసుకుంటోందట. ఈ మధ్య ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం నుపుర్ సనన్ దగ్గరికి వెళ్లిన ఓ నిర్మాతకి షాక్ తగిలిందట.

ఏం మాట్లాడాలన్నా మా అక్కతో మాట్లాడండి.. అని ఆ నిర్మాతకి చెప్పిందట నుపుర్ సనన్. అది విని ఆ నిర్మాత షాక్ అయ్యాడట. నుపుర్ చెప్పిన మాటకి ఆ నిర్మాత మైండ్ బ్లాంక్ అయ్యిందని ఇండస్ర్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదలా వుంటే, చెల్లెలిపై కృతి సనన్ తీసుకుంటున్న ఈ ఎక్స్‌ట్రా కేరింగ్‌కి అంతా అవాక్కవుతున్నారు మరోపక్క.