కృష్ణవంశీ దర్శకత్వంలో చిరంజీవి.!

కృష్ణవంశీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయాల్సి వుంది. అదే ‘వందేమాతరం’. అయితే ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ ఓ కొలిక్కి రావడం లేదు.

ఇటీవలే ‘రంగమార్తాండ’ సినిమాతో కృష్ణ వంశీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సినిమా గురించి రిలీజ్‌కి ముందు అంతకాదు ఇంతకాదు.. అంటూ ఎత్తేశారు. తీరా రిలీజయ్యాకా అంత సీను లేదని పక్కకి నెట్టేశారు.

అయితే, ‘రంగమార్తాండ’ టైమ్‌లోనే చిరంజీవికి, కృష్ణవంశీ ఓ కొత్త కథ చెప్పాడట. కథ నచ్చిందట. డెవలప్ చేయమని సూచించాడట చిరంజీవి.

త్వరలోనే ఈ స్టోరీ కార్య రూపం దాల్చే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. ఒకవేళ అంతా సెట్ అయితే, ‘రంగమార్తాండృతో తగిలిన షాక్ నుంచి కృష్ణవంశీకి ఊరట దక్కే అవకాశముంటుంది చిరంజీవి ప్రాజెక్ట్‌తో. చూడాలి మరి.