అరెరే.. కొరటాలకే కోపం తెప్పించారే..

koratala siva

సాధారణంగా దర్శకులకు కోపం ఉండడం సహజం. 24 క్రాఫ్ట్స్ ను ఒక్కడే చూసుకోవాలి. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా సహనంతో ఉండడం అంటే చాలా కష్టమైన పని. అయితే కొరటాల శివ కూడా సాధారణంగా ఎక్కువగా కోప్పడరు. కానీ ఇటీవల కొందరి వల్ల ఆయన చాలా చిరాకు పడినట్లు తెలుస్తోంది.

acharya

 

ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న కొరటాల శివ ఇటీవల షూటింగ్ లో ఉండగా కొన్ని ఫొటోస్ లీక్ అవ్వడం వలన కోపానికి వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా నుంచి కోలుకోగానే రామ్ చరణ్ ను కలవడానికి కొంతమంది అభిమానులు ఆచార్య సెట్ కు వచ్చారు. అయితే అక్కడ చరణ్ తో అభిమానులు ఫొటోలు దిగారు.

సెట్స్ లోనే ఫొటోలు దిగడంతో దాదాపు టెంపుల్ సెట్ కు సంబంధించిన లోపలి భాగం యొక్క ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంతో కీలకమైన సెట్ లోని లోపలి భాగం మొత్తం సోషల్ మీడియాలో అలా బయటపడటం ఏ మాత్రం నచ్చలేదట. కొంతమంది చిత్ర యూనిట్ సభ్యులపై కూడా కొరటాల ఆగ్రహానికి లోనవ్వడంతో రామ్ చరణ్ కలుగజేసుకొని ఇదంతా తనవల్లే జరిగిందని నెక్స్ట్ టైమ్ ఇలా జరగకుండా చూసుకుంటానని కూల్ చేశాడని సమాచారం.