జోరు మీదున్న నటి కియారా!

ఇప్పుడు బాలీవుడ్‌ లో అగ్ర నటీమణుల్లో స్థానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్న నటీమణుల్లో కియారా అద్వానీ ఒకరు. రామ్‌ చరణ్‌ పక్కన ‘గేమ్‌ చెంజర్‌’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. శంకర్‌ దర్శకుడు, దిల్‌ రాజు నిర్మాత. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా, మిగతా భాషల్లో కూడా విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. ఈ సినిమాతో పాటు ఇంకో పెద్ద సినిమా ‘వార్‌ 2’ లో కూడా కియారా కథానాయిక.

గతేడాది ఫిబ్రవరి 7 తనతో ప్రేమలో వున్న సహచర నటుడు సిద్దార్థ్‌ మల్హోత్రా ని వివాహం చేసుకుంది కియారా అద్వానీ. తెలుగులో ‘భరత్‌ అనే నేను’ సినిమాతో మహేష్‌ బాబు పక్కన ఆరంగేట్రం చేసింది. ఆ తరువాత ‘వినయ విధేయ రామ’ అనే ఇంకో తెలుగు సినిమాలో నటించింది, ఇందులో రామ్‌ చరణ్‌ కథానాయకుడు. కియారా కి ‘భరత్‌ అనే నేను’ పెద్ద బ్రేక్‌ ఇచ్చిన సినిమా. తెలుగు సినిమా విడుదల సమయంలోనే ‘లస్ట్‌ స్టోరీస్‌’ అనే ఒక వెబ్‌ సినిమాలో ఒక బోల్డ్‌ పాత్రలో నటించి, అందరి దృష్టి ఆకర్షించింది.

తెలుగులో పెద్ద విజయం సాధించిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాని హిందీలో తెలుగు దర్శకుడు సందీప్‌ వంగా ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో అర్జున్‌ కపూర్‌ కథానాయకుడిగా రీమేక్‌ చేశారు. అందులో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. హిందీలో కూడా ఇది పెద్ద విజయం సాధించింది. హిందీలో తన ప్రియుడు సిద్దార్థ్‌ మల్హోత్రా పక్కన నటించిన యుద్ధ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘షేర్‌ షా’. ఇది నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో విడుదలైంది.

ఈ సినిమా అటు విమర్శకుల ప్రశంశలు, ఇటు ప్రేక్షకుల మన్ననలు పొందింది. 2021లో వచ్చిన ఈ సినిమా తరువాత కియారా సినిమాలు అంతగా బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర ప్రభావం చూపలేదని చెప్పాలి. కియారా ఇప్పుడు’గేమ్‌ చేంజర్‌’ సినిమాపై చాలా అసలు పెట్టుకున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె చేతిలో ఈ ఒక్క తెలుగు సినిమానే వుంది. ఇది హిందీలో కూడా విడుదలవుతుంది అని అనుకుంటున్నారు. ఈ సినిమా విడుదల తరువాత ఆమె ‘వార్‌ 2’ షూటింగ్‌ లో పాల్గొంటారు. ఇందులో ఎన్టీఆర్‌,హృతిక్ రోషన్‌ లు కథానాయకులు.