Mahesh Babu : స్క్రిప్ట్ సెట్ అయితే మహేష్ బాబుతో కేజిఎఫ్ నిర్మాత మూవీ…?

Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబు నుంచి సర్కారు వారి పాట సినిమా రాబోతోంది.ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో వస్తుండగా కీర్తి సురేష్ మొదటి సారి మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చినా కళావతి పాట, పెన్ని సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయ్. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు కు త్రివక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా, ఇంకా రాజమౌళి దర్శకత్వం లో ఒక సినిమా లైన్ లో వున్నాయ్.అయితే ఇప్పుడు తాజాగా కేజీఫ్ లాంటి సంచలన చిత్రాలను నిర్మించిన హోంబలే సంస్థ మహేష్ తో ఒక సినిమా చేయాలన్న ఆలోచనలో వున్నారట.

2012వ సంవత్సరంలో విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ అనే  నిర్మాణ రంగ సంస్థలను స్థాపించి కన్నడ లో కొన్ని చిత్రాలు కూడా నిర్మించడం జరిగింది. కేజీఫ్ సిరీస్ కంటే ముందు నిర్మాణ సంస్థ మూడు సినిమాలను కూడా నిర్మించింది. ఈ సంస్థలోని మొదటి సినిమాను నిన్నిడాలే ను తెలుగులో కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ఈ సంస్థ నిర్మించారు. రెండవ సినిమాను కే జి ఎఫ్ హీరో యష్ తో మాస్టర్ పీస్ గా నిర్మించారు. మూడవ సినిమా అయిన రాజకుమార ను పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కించారు. తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా కే జి ఎఫ్ లను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాల తర్వాత హోంబలే ఫిలింస్ నిర్మించిన కేజీఫ్ సిరీస్ లు మాత్రం ప్రపంచాన్ని కన్నడ చలనచిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేసింది.ఇప్పుడు మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ లా వేట లో వున్నారట. అనుకున్న స్క్రిప్ట్ దొరికితే డైరెక్టర్ ఎవరు అన్న విషయం ఆలోచిస్తారట.అన్ని కుదిరితే మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కానీ మరోవైపు మహేష్ వరుస కమిట్మెంట్స్ తో వున్నారు. మరి ఎంతవరకు ఈ కాంబినేషన్ కుదురుతుందో చూడాలి.