నా పెళ్లి గురించి నేనే చెప్తా.. కీర్తి సురేష్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ వైపు హీరోల సరసన నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవల దసరా సినిమాలో వెన్నెల పాత్రలో అదరగొట్టింది. డీ గ్లామర్ లుక్ లో కూడా అందంగా కనిపించింది. ఆమె అందానికీ, నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ పాత్రలో కీర్తి కాకుండా మరెవరూ ఇంత అద్భుతంగా నటించరేమో అన్నట్లుగా నటించింది.

అయితే, ఈ మధ్య కీర్తి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆమె పెళ్లి వార్త వినపడుతూనే ఉంది. కీర్తికి పెళ్ల అంట, వరుడు అతడే అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల తన ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడంతో ఈ వార్తలు మరీ ఊపందుకున్నాయి. అతను కీర్తి బాయ్ ఫ్రెండ్ అని అతనితోనే పెళ్లి అంటూ గాసిప్స్ వచ్చాయి. ఈ వార్తలు రోజు రోజుకీ పెరుగుతుండటంతో తాజాగా కీర్తి స్పందించింది. తన పెళ్లి గురించి తానే చెబుతానని ఆమె చెప్పడం విశేషం.

ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ తో కీర్తి మామన్నన్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ నిర్వహించగా, అక్కడ మీడియా నుంచి ఆమెకు ఈ ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి ఎప్పుడు అని అడిగేశారు. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే తాను తన పెళ్లి విషయం గురించి క్లారిటీ ఇచ్చానని, మళ్లీ అదే విషయం పదే పదే ఎందుకు అడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. నిజంగా తాను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతానని, ఇన్ని సార్లు అడగాల్సిన అవసరం లేదని ఆమె చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా, ఇక కీర్తి లేటెస్ట్ మూవీ దసరా సూపర్ హిట్ కొట్టింది. దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని హీరోగా తెరకెక్కిన దసరా మార్చి 30న విడుదలై మంచి విజయం సాధించింది.

ఇక ‘మామన్నన్’ చిత్రం ఈనెల 29న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మరోవైపు తెలుగులో కీర్తి సురేష్ ‘భోళా శంకర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో చిరుకి చెల్లిగా ఆమె నటిస్తోంది.