తమన్నాకి అంత సీను లేదా.?

‘భోళా శంకర్’లో హీరోయిన్ తమన్నా అయినా స్ర్కీన్ స్పేస్ మాత్రం కీర్తి సురేష్‌కే ఎక్కువ. తమిళంలో కూడా హీరోయిన్‌కి పెద్దగా ప్రాధాన్యత వుండదు. తమిళంలో ఈ పాత్రలో శృతి హాసన్ నటించింది. శృతి హాసన్ పాత్ర కేవలం కొన్ని సీన్లకు మాత్రమే పరిమితవుతుంది. తమిళంతో పోల్చితే, తెలుగులో తమన్నాకి కాస్త ఎక్కువ సీన్లే వుండబోతున్నాయట. అయినా కానీ, కీర్తి సురేష్ పాత్రకే వెయిటేజ్ ఎక్కువ.

ప్రమోషన్లలోనూ కీర్తి సురేషే ఎక్కువ హైలైట్ అవుతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో తమన్నా మిస్ కొట్టడం అక్కడా స్టేజ్ స్పేస్ అంతా కీర్తి సురేష్ సొంతమైపోయింది. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ఇక్కడా కీర్తి సురేష్‌దే పై చేయి అని తెలుస్తోంది. తమన్నాతో పోల్చితే, కీర్తి సురేష్‌కే ఎక్కువ పే చేశారట.

అన్నట్లు తమన్నాకి చిరంజీవితో రెండో సినిమా ఇది. ‘సైరా నరసింహారెడ్డి’లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. అందులోనూ గెస్ట్ రోల్‌ తరహాకే పరిమితమైంది తమన్నా.