కత్రినా జంటకు చంపుతామంటూ బెదిరింపు.. పోలీసులను ఆశ్రయించిన దంపతులు?

Katrina Kaif : ఇటీవల బెదిరింపులతో బాలీవుడ్ లో కలకలం రేగుతోంది. గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని చంపేస్తా అంటూ వచ్చిన బెదిరింపులు కలకలం రేపాయి. ఆ ఘటన మరువకముందే మరొకసారి బెరిరింపులతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ అండ్ విక్కీ కౌషల్ కి చంపేస్తా అంటూ ఇటీవల బెదిరింపులు వచ్చాయి . దీంతో ఈ బెదిరింపులు బాలీవుడ్ లో మరొకసారి కల్లోలం సృష్టించాయి. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇటీవల వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత ఈ జంట ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న వీరిద్దరూ ఇటు ఫిల్మ్ కెరీర్‌ను.. అటు మ్యారీడ్ లైఫ్ ను చాలా హ్యాపీ గా లీడ్‌ చేస్తున్నారు. పెళ్ళి తర్వాత ఇద్దరు సినిమాలతో బిజీ అయ్యారు. అంతేకాకుండా ఇటీవల ఈ జంట మాల్దీవ్స్ లో సందడి చేసింది. కత్రినా కైఫ్ పుట్టిన రోజు సందర్భంగా మాల్దీవ్స్ చేక్కేసిన ఈ జంట అక్కడ స్నేహితులతో కలసి కత్రినా కైఫ్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పుట్టిన రోజుకి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఈ స్టార్ జంట కి ఇన్‌స్టా వేదికగా బెదిరింపులు వచ్చాయి.

ఇన్ స్టా లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్రినా.. విక్కీని చంపేస్తా అంటూ.. కత్రినకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భయపడిపోయి ఈ జంట ముంబయ్‌లోని శాంతాక్రూజ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇన్ స్టాలో తమకి వచ్చిన బెదిరింపుల గురించి చెప్పి కేసు నమోదు చేయించారు. అయితే ఈ బెదిరింపులను సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు.. IT Act కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే ఈ బెదిరింపులకు పాల్పడిన నిందితున్ని పట్టుకుంటా మంటూ.. పోలీసులు వెల్లడించారు. అయితే ఇలా సల్మాన్ ఖాన్ కి వచ్చిన బెరిరింపులు మరువక ముందే కత్రినా కైఫ్ కి బెదిరింపులు రావటంతో బాలీవుడ్ లో స్టార్స్ భయపడిపోతున్నారు.