“జపాన్” ప్రమోషన్స్ లో “ఖైదీ 2” అప్డేట్ ఇచ్చిన కార్తీ..! 

అటు తమిళ సినిమా దగ్గర అలాగే ఇక్కడ తెలుగు ఆడియెన్స్ లో కూడ  టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “జపాన్”. మరి కార్తీ నుంచి మరో సాలిడ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనగా..

ఈ దీపావళి కానుకగా అయితే మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఆల్రెడీ సెన్సార్ ని కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు రన్ టైం అయితే బయటకి వచ్చింది మరి దీనితో ఈ చిత్రం 156.06 నిమిషాల నిడివిని లాక్ చేసుకుంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్స్ తెలుగులో కూడా గట్టిగా చేస్తుండగా ఈరోజు గ్రాండ్ గా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.

మరి ఈ చిత్రం ప్రమోషన్స్ లో కార్తీ తన క్రేజీ అండ్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “ఖైదీ 2” పై ఓ ఆసక్తికర అప్డేట్ అయితే అందించాడు. కాగా ఈ సినిమాని తాను లోకేష్ కనగరాజ్ వచ్చే జనవరిలోనే స్టార్ట్ చేయాల్సి ఉంది అని కానీ రజినీకాంత్ గారి సినిమా లోకేష్ చేయాల్సి రావడంతో ఖైదీ 2 షూట్ ఆ సినిమా తర్వాత ఉంటుంది అని కన్ఫర్మ్ చేసాడు.

ఇప్పుడు ఖైదీ 2 పై క్రేజ్ మాములుగా లేదు. మెయిన్ గా లోకేష్ కనగరాజ్ తన లియో సినిమా తర్వాత ఒకో పాత్రని మించి ఖైదీ 2 లో ఢిల్లీ పై మరింత క్రేజ్ అయితే స్టార్ట్ అయ్యింది. అందుకే ఖైదీ 2 పై ఇన్ని అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. మరి ఈ సెన్సేషనల్ అండ్ అవైటెడ్ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.