ఆచార్య సెట్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ దంప‌తులు.. దండ‌లు మార్చుకొని చిరు బ్లెస్సింగ్స్

కలువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్, బిజినెస్ మెన్ గౌత‌మ్ కిచ్లు అక్టోబ‌ర్ 30న మూడు ముళ్లు, ఏడ‌డుగుల బంధంతో ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల‌న చాలా సింపుల్‌గా వీరిరివురు వివాహం చేసుకోగా, పెళ్లైన కొద్ది రోజుల‌కు హ‌నీమూన్ కోసం మాల్దీవుల‌కి వెళ్లారు. అక్క‌డి అందాల‌ని కెమెరాలో బంధించి ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్ ముందు ఉంచింది. స‌ముద్రం లోప‌ల బెడ్‌పై త‌న భ‌ర్త‌తో క‌లిసి గౌత‌మ్ దిగిన ఫొటో హ‌నీమూన్ పిక్స్‌లోనే స్పెష‌ల్ చెప్ప‌వ‌చ్చు.

ఆచార్య సెట్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ దంప‌తులు.. దండ‌లు మార్చుకొని చిరు బ్లెస్సింగ్స్

హ‌నీమూన్ టూర్ పూర్తైన త‌ర్వాత ముంబైకి వ‌చ్చిన కాజ‌ల్ కొద్ది రోజులు త‌న భ‌ర్త‌తో ఆనందంగా గ‌డిపి, రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. ఈ రోజు ఆచార్య సెట్‌కు త‌న భ‌ర్త‌తో క‌లిసి రావ‌డంతో నూత‌న దంప‌తుల‌ని ఆశీర్వ‌దించారు. అంతేకాక వారితో దండ‌లు మార్పించి, కేక్ క‌ట్ చేయించారు. ప్ర‌స్తుతం ఆచార్య సెట్‌లో కాజ‌ల్ దంప‌తులు దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

కాజ‌ల్ అగ‌ర్వాల్ ఖాతాలో ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో పాటు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. భార‌తీయుడు 2, ముంబై సాగా, పారిస్ పారిస్, మోస‌గాళ్లు వంటి చిత్రాలతో బిజీ కానుంది కాజ‌ల్. ముందుగా ఆచార్య షూటింగ్ పూర్తి చేసి ఆ త‌ర్వాత మిగ‌తా సినిమా టీంతో క‌ల‌వ‌నుంది. ఇక ఇదిలా ఉంటే త‌న భ‌ర్త బిజినెస్ మెన్‌కు కూడా అంబాసిడ‌ర్‌గా ప‌ని చేస్తుంది. భర్త కిచ్లుకి సంబంధించిన ఇ-కామర్స్ సంస్థ డిస్కర్న్ లివింగ్‌కి ఎండోర్స్ మెంట్ చేస్తోంది కాజల్. ఈ సంస్థ త్వరలోనే కాజల్‌తో బ్రాండ్ పబ్లిసిటీకి సంబంధించిన బ్రోచర్లను కూడా విడుదల చేయబోతుంది.