మెగాస్టార్‌తో జర్నీ మొదలయింది : దర్శకుడు వశిష్ట వెల్లడి

చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న 157 వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. ’బింబిసార’ ఫేం వశిష్ఠ ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్కీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా వదిలిన కాన్సెప్ట్‌ పోస్టర్‌కు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడు వశిష్ఠ ట్విట్టర్‌ వేదికగా వెల్లడిరచారు. ‘మెగాస్టార్ట్‌.. మెగామూవీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలుపెట్టాం.

త్వరలోనే విూ అందరినీ సినిమాటిక్‌ అడ్వెంచర్‌లోకి తీసుకెళ్లబోతున్నాం‘ అని చిరంజీవితోపాటు, దర్శకుడు వశిష్ఠ, ఛోటా కె నాయుడు, వంశీ, విక్రమ్‌ కలిసి దిగిని ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ’బింబిసార’ చిత్రంతో భారీ విజయం అందుకుని దర్శకుడిగా నిరూపించుకుంచుకున్న వశిష్ఠకు రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు కెమెరామెన్‌గా పని చేయనున్నారు.