‘హాయ్‌ నాన్నా’ సినిమా చూసిన జాన్వీ.. మృణాల్‌ ఠాకూర్‌ నటనకు ఫిదా!

‘దేవర’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తాజాగా.. తన ఇన్‌స్టా వేదికగా ‘హాయ్‌ నాన్నా’ సినిమాపై స్పందించింది. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్నా’చిత్రం ఓటీటీలో విడుదల కాగా, ఈ సినిమాని చూసిన జాన్వీ కపూర్‌.. ఇన్‌స్టా వేదికగా సినిమాపై పొగడ్తల వర్షం కురిపించింది. మరీ ముఖ్యంగా మృణాల్‌ ఠాకూర్‌ నటనకు ప్రేమలో పడిపోయా నంటూ ఆమె చెప్పు కొచ్చింది.

అలాగే దర్శకుడు, చిత్ర హీరో నేచురల్‌ స్టార్‌ నాని గురించి కూడా ఆమె గొప్పగా చెప్పు కొచ్చింది. నాని, మృణాల్‌ ఠాకూర్‌ ఉన్న పోస్టర్‌ షేర్‌ చేసిన జాన్వీ కపూర్‌.. మృణాల్‌ నీ నటనకు ప్రేమలో పడిపోయా. మొదటి ప్రయత్నంలోనే మనుసుని హత్తుకునే చిత్రాన్ని రూపొందించిన శౌర్యువ్‌కు కృతజ్ఞతలు. నాని.. ఎప్పటిలాగే చాలా గొప్పగా నటించారని, తన ఇన్‌స్టా స్టోరీస్‌లో చెప్పుకొచ్చింది.

జాన్వీ కపూర్‌ చేసిన ఈ పోస్ట్‌పై చిత్ర నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్‌ స్పందిస్తూ… ‘విూ ప్రశంసలు మాకెంతో విలువైనవి’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం జాన్వీ పోస్ట్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. నేచురల్‌ స్టార్‌ నాని హోల్సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌ నాన్న’ మ్యాజికల్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్‌ మొదటి ప్రొడక్షన్‌ వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్‌ దర్శకునిగా పరిచయమయ్యారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా, బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించింది.

ఈ చిత్రాన్ని మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. రీసెంట్‌గానే ఈ చిత్రం నెట్‌ప్లిక్స్‌ ఓటీటీలో విడుదలై.. అక్కడ కూడా మంచి ఆదరణను చూరగొంటోంది.