చూడబోతే వారం రోజుల్లోనే పెళ్లి చేసేలా ఉన్నారు: సోషల్‌ విూడియా వార్తలపై జాన్వీ కపూర్‌ వ్యాఖ్య

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ పెళ్లి వార్తలు సోషల్‌ విూడియాలో తరచూ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించారు. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆంగ్ల విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై వచ్చిన రూమర్స్‌కు చెక్‌ పెట్టారు. ‘ఇటీవల నా పెళ్లికి సంబంధించిన వార్తలు కొన్ని చదివాను. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశారు. పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన రెండు, మూడు కథనాలు మిక్స్‌ చేసి అలా రాశారు. నాకు తెలియకుండానే వారంలో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. నేను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా” అని చెప్పారు. దీంతో ఈ వార్తలకు చెక్‌ పడినట్లు అయింది.

ఇక ఇటీవల జాన్వీ పెళ్లిపై ఓ నెటిజన్‌ పోస్ట్‌ పెట్టగా.. దానికి ఆమె రియాక్ట్‌ అయ్యారు. ‘ఏదైనా రాస్తారా..’ అని రిప్లై పెట్టారు. మరోవైపు జాన్వీ తాజాగా సోషల్‌విూడియా వెబ్‌సైట్‌ లో రెడిట్‌ యూజర్లతో చిట్‌చాట్‌ చేశారు. ఇందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై వైరల్‌గా మారింది. ‘మనం డేట్‌కు వెళ్దామా? అది మంచి స్టోరీ అవుతుంది’ అని ఓ యూజర్‌ అడగ్గా దానికి జాన్వీ సరదాగా స్పందించారు. ‘నువ్వు గొడ్డలితో నరికి చంపేసే హంతకుడివి అయితే ఎలా?’ అన్నారు.

రెడిట్‌ను తనకంటే తన చెల్లి ఖుషీనే ఎక్కువగా వాడుతుందని చెప్పారు. ఇందులో విశేషాలు చెల్లిని అడిగి తెలుసుకుంటానని జాన్వీ వెల్లడించారు. సోషల్‌ విూడియా అంటే భయమని ఈ ‘దేవర’ భామ తెలిపారు. జాన్వీ ప్రస్తుతం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే31న ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితో పాటు తెలుగులోనూ రెండు సినిమాల్లో నటిస్తున్నారు.