ఆ పాత్రలో తారక్ చేసి ఉంటే బాగుండేది… డైరెక్టర్ కామెంట్స్!

Jr-NTR-about-future-projects-NTR30-and-NTR31

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు బాలయ్య సినీ కెరియర్ లోని ఏ సినిమా రాబట్టని ఓపెనింగ్స్ వీర సింహారెడ్డి సినిమా రాబట్టింది. ఇలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం కూడా ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని సైతం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆశక్తికరమైన విషయాలను తెలియచేస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి జై సింహ రెడ్డి పాత్రలలో బాలయ్య నటించిన సందడి చేశారు.అయితే ఈ సినిమా చూసిన అనంతరం ఎంతోమంది నందమూరి అభిమానులు ఈ సినిమాలో జయసింహారెడ్డి పాత్రలో బాలకృష్ణకు బదులుగా ఎన్టీఆర్ నటించి ఉంటే అద్భుతంగా ఉండేదని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇలా నందమూరి హీరోలు బాబాయ్ అబ్బాయ్ లను ఒకే తెరపై చూడాలనేదే నందమూరి అభిమానుల కోరిక దీంతో ఈ సినిమాలో కనుక నటించి ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ జై సింహారెడ్డి పాత్రలో తారక్ కనక చేసి ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఉండేది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం గోపీచంద్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.