షూటింగ్ ఎప్పుడు మొదలైందన్నది కాదు .. సమ్మర్ లో బొమ్మ పడుతుందా లేదా …?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న సినిమా ” సర్కారు వారి పాట ” కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్, మైత్రీ మూవీస్ పతాకాలపై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పరశురాం ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే పరశురామ్ – సినిమాటోగ్రాఫర్ మధి – ఆర్ట్ డైరెక్టర్ ఏయస్ ప్రకాష్ విదేశాలలో లొకేషన్స్ ఫైనల్ చేసుకున్నారు.

Sarkaru Vaari Paata Motion Poster | Mahesh Babu | Parasuram Petla | Thaman  S - YouTube

కాగా ‘సర్కారు వారి పాట’ ఫారిన్ షెడ్యూల్ 45 రోజులు ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో 50 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట మహేష్ టీమ్. 2021 సమ్మర్ టార్గెట్ గా సినిమాని కంప్లీట్ చేయడమే కాదు పాన్ ఇండియన్ లెవల్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారట. అయితే ఈ సినిమా అక్టోబర్ లోనే అమెరికాలో ఈ భారీ షెడ్యూల్ మొదలు పెట్టాలని ప్లాన్ చేశారు. కాని యూనిట్ లో కొంతమందికి వీసా సమస్య రావడంతో డిలే అయింది.

కాగా ఇప్పుడు డిసెంబర్ నుంచి లేదా జనవరి నుంచి సర్కారు వారి పాట షూటింగ్ మొదలవబోతుందని సమాచారం. అయితే డిసెంబర్ కూడా డౌటే 2021 సంక్రాంతి తర్వాత మొదలవబోతుందన్న మాట గట్టిగా వినిస్తోంది. అయితే జనవరి నుంచి మొదలైతే సమ్మర్ రేస్ లో సర్కారు వారి పాట ని దింపడం సాధ్యమవుతుందా లేదా అన్నది ఇప్పుడు కొంతమందికి సందేహాలు కలుగుతున్నాయట. అయితే జనవరి నుంచి మొదలైన కూడా సమ్మర్ కి రిలీజ్ పక్కా అంటున్నారట మేకర్స్. అలాగే షూటింగ్ షెడ్యూల్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఒకేసారి జరగడానికి ప్లాన్ చేశారట.