“గుంటూరు కారం”.. గురూజీ దెబ్బేసాడా?

టాలీవుడ్ సినిమా దగ్గర ఈ సంక్రాంతి సందర్భంగా వచ్చిన చిత్రాల్లో పెద్ద హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం రిలీజ్ ముందు నుంచే మంచి టాక్ లో ఉంది.

దీనితో మహేష్ బాబు మరో బిగ్ హిట్ కొట్టేసాడు అని అంతా అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక పబ్లిక్ నుంచి టాక్ మాత్రం అంత పాజిటివ్ లో ఏమి కనిపించడం లేదు. మహేష్ బాబు తన వల్ల అయ్యింది అంతా చేసాడు కానీ ఇక్కడ అందరూ ఒక్క వ్యక్తిని మాత్రమే అంటున్నారు.

అతడే దర్శకుడు త్రివిక్రమ్. ఒకప్పటి త్రివిక్రమ్ ఇప్పుడు కనిపించడం లేదు అనే మాటకి సమాధానంగా అరవింద సమేత ఇంకా అల వైకుంఠపురములో సినిమాలతో తాను సమాధానం ఇచ్చాడు కానీ ఇపుడు గుంటూరు కారంతో దెబ్బేసాడని సినిమా చూసిన తర్వాత ఆడియెన్స్ అంటున్నారు.

సినిమాకి ఏదన్నా లోటు ఉంది అంటే అది గురూజీ మాత్రమే చెప్పక తప్పడంలేదు అని అంటున్నారు. కాగా ఒక్క మహేష్ బాబు ఫ్యాన్స్ కి తప్ప ఇంకెవరికీ పెద్దగా సినిమా ఎక్కకపోవచ్చు అనే టాక్ కూడా ఇప్పుడు మొదలైంది. వీటితో మాత్రం గుంటూరు కారం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఉండే అంచనాలు అంతగా రీచ్ కాలేకపోయింది అని చెప్పాలి. ఇక వసూళ్లు లాంటివి ఎలా ఉంటాయో చూడాలి.