అక్షయ్ కుమార్ ఛాన్స్ ఇచ్చే ఆ తెలుగమ్మాయి ఈమేనా ..?

బాలీవుడ్ లో ఖాన్ ల త్రయాన్ని వెనక్కి నెట్టి గత మూడు.. నాలుగేళ్ళుగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ నంబర్ వన్ ప్లేస్ కి చేరుకున్నాడు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అక్షయ్ కుమార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రం వందల కోట్ల వసూళ్ళ ని సాధిస్తున్నాయి. దాంతో నిర్మాతలందరు దాదాపు అక్షయ్ కుమార్ తో సినిమా చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. గడిచిన ఈ మూడేళ్ళలో బాలీవుడ్ లో ఊపేస్తున్న హీరో కేవలం అక్షయ్ మాత్రమే.

Akshay Kumar and Kriti Sanon starrer 'Bachchan Pandey' to go on floors in  January 2021 | Hindi Movie News - Times of India

ఇక సౌత్ సూపర్ హిట్ సినిమా కాంచన రీమేక్ లో నటించాడు అక్షయ్ కుమార్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 9 న భారీ స్థాయిలో రిలీజవుతోంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాడు. కాగా అక్షయ్ కుమార్ మరో నాలుగు సినిమాలు కమిటయ్యాడు. వీటిలో ‘బచ్చన్ పాండే’ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా పర్హద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ జంటగా కృతి సనన్ ఎంపిక చేశారు.

అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశాలున్నాయట. ఆ హీరోయిన్ ని మన సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకోనున్నారని తెలుస్తుంది. అది కూడా పక్కా తెలుగమ్మాయినట. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలలో నటిస్తున్న తెలుగమ్మాయిలంటే ఒకరు రీతు వర్మ.. ఒకరు ఐశ్వర్య రాజేష్. ఈ ఇద్దరు టాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ తో పాటు స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో నటించే అవకాశం అందుకోనున్నారని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఆ తెలుగమ్మాయి ఎవరో ..!