ఉప్పెన రిజల్ట్ మొత్తం ఆ ఒక్క షో మీదే ఉందా..?

ఉప్పెన రిజల్ట్ నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు. మైత్రీ మూవీస్ తో కలిసి సుకుమార్ ఉప్పెన సినిమాని నిర్మించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ ఓ ఆతృత విపరీతంగా పెరిగిపోతోంది. ప్రమోషన్స్ లో బాగా స్పీడ్ పెంచారు. రీసెంట్ గా నిర్వహించిన ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా బాగా కలిసి వచ్చింది. మెగా ఫ్యామిలీ హీరో కాబట్టి పబ్లిసిటీకి ఏమాత్రం కొదవలేదు. మౌత్ టాక్ ఒక్కటే విపరీతంగా జరుగుతుంది. ఇక ఉప్పెన సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి జంట అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

is-the-result-of-uppena-depends-on-that-one-show
is-the-result-of-uppena-depends-on-that-one-show

మెగా ఫ్యామిలీ హీరో పెద్ద నిర్మాణ సంస్థ.. సుకుమార్ వెనకుండి ప్రాజెక్ట్ ని నడిపించాడు కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే కొందరిలో కొత్త సందేహాలు కూడా ఉన్నాయి. క్రాక్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా 50 పర్సెంట్ ఆక్యూపెన్సీ నేపథ్యంలో రిలీజ్ అయింది. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా థియేటర్స్ కి రాలేదు. దాదాపు వచ్చిన వాళ్ళందరు మాస్ ఆడియన్సే. అయితే ఉప్పెన సినిమా కి కీలకంగా మారింది ఫ్యామిలీ ఆడియన్స్. ఖచ్చితంగా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ దక్కాలి. అదే జరిగితే గ్యారెంటీగా ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుంది.

అయితే మార్నింగ్ షో పబ్లిక్ టాక్ మీదే ఉప్పెన సినిమా రిజల్ట్ ఆదారపడి ఉందని చెప్పుకుంటున్నారు. మార్నింగ్ షో అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ అని టాక్ వస్తే ఖచ్చితంగా ఆ టాక్ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ గనక వచ్చి సినిమాని ఆదరిస్తే ఉప్పెన సినిమా సక్సస్ ని ఎవరూ ఊహించలేరు. డెబ్యూ సినిమా నే హీరో.. హీరోయిన్.. దర్శకుడికి భారీ హిట్ గా నిలుస్తుంది. లేదంటే అంచనాలు తారుమారైనా అవ్వొచ్చు. అదే జరిగితే మేకర్స్ ఉప్పెన సినిమా మీద పెట్టుకున్న నమ్మకం దెబ్బ తిన్నట్టే. అంటే ఉప్పెన మార్నింగ్ షో పడి హిట్ టాక్ వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ కరోనాని లెక్క చేయకుండా థియేటర్స్ కి వస్తే కొత్త రికార్డ్స్ సాధించడం ఖాయం అనమాట.