సమంత చేతిలో రుద్రాక్షలు ధరించటానికి వెనుక రహస్యం అదేనా..?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంతకాలానికి మంచి గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. సమంత కొంతకాలంగా మయోసైటీస్ అని వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసింది. ఇప్పుడిప్పుడే సమంత ఆ వ్యాధి నుండి కోలుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమాల పట్ల సమంతకి ఉన్న అంకిత భావం అందరికీ తెలిసిందే. ఆమె అనారోగ్యంగా ఉన్నా కూడా యశోద సినిమా కోసం డాక్టర్ల సమక్షంలో డబ్బింగ్ చెప్పింది.

ఇక చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సమంత ఇటీవల శకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చింది. తాజాగా శకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత పాల్గొనింది. ఈవెంట్ లో సమంత చాలా ఎమోషనల్ అయ్యింది. ఇక ఇటీవల యశోద సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న సమంత ప్రస్తుతం శకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. ఇక తాజాగా శకుంతలం సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా కోసం కూడా సమంత డాక్టర్ల సమక్షంలో డబ్బింగ్ సెషన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సమంత ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో సమంత తన చేతిలో రుద్రాక్ష మాల ధరించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే సమంత ఇలా రుద్రాక్ష మాల ధరించడం వెనుక గల రహస్యం ఏమిటని ఆరా తీస్తున్నారు. హీరోయిన్ సాయి పల్లవి కూడా ఎప్పుడు తన చేతిలో రుద్రాక్ష మాలను ధరించి ఉంటుంది. అయితే సాయి పల్లవి తరహాలోనే సమంత ఇలా రుద్రాక్ష మాలను ధరించింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతకి దైవభక్తి బాగా పెరిగింది. అంతేకాకుండా సమంతకి జాతకాల పట్ల కూడా బాగా నమ్మకం ఉండటం వల్ల ఇలా రుద్రాక్ష మాల ధరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.