పెళ్లయి ఇన్నేళ్లయినా ప్రియమణికి పిల్లలు లేకపోవడానికి అదే కారణమా?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి ప్రియమణి ఒకరు. ఈమె కూడా ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరు సరసన నటించిన ప్రియమణి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఒకవైపు వెండితెర పైన మరోవైపు బుల్లితెర పైన ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియమణి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈయనకు ఇదివరకే పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉండడం విశేషం. ఇలా పెళ్లయిన వ్యక్తిని ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇలా వీరి వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ప్రియమణి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. నిజానికి ఈమె భర్త ముస్తాఫా రాజ్ కు పిల్లలంటే ఎంతో ఇష్టం కానీ ప్రియమణి మాత్రం ఇప్పుడప్పుడే పిల్లలను వద్దని ఆలోచనలో ఉన్నారట.

ఇప్పుడిప్పుడే ప్రియమణి తన సెకండ్ ఇన్ని ప్రారంభించి వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. అలాగే బుల్లితెర కార్యక్రమాలతో కూడా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈమె పిల్లల గురించి ఆలోచిస్తే తన బాడీ ఫిజిక్స్ మొత్తం మారిపోవడమే కాకుండా తన సినిమాలపై కాన్సన్ట్రేషన్ తగ్గుతుందని అదేవిధంగా పుట్టబోయే పిల్లలపై కూడా సరైన శ్రద్ధ చూపించలేక పోతానన్న ఉద్దేశంతో పిల్లలను కొంతకాలం పాటు వద్దని ఆలోచించారట. ఇక పిల్లల విషయంలో ప్రియమనని బాధ పెట్టడం ఇష్టం లేనటువంటి ముస్తఫా రాజ్ ఈ విషయంలో ప్రియమణితో కాంప్రమైజ్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కెరియర్ కోసం పిల్లలను ఇప్పుడే వద్దనుకోవడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.