Raana : విరాట పర్వం మనదాకా వస్తుందా…. థియేటర్లలో విడుదలకు సురేష్ బాబు ఆసక్తి చూపడం లేదా…!

Raana : రానా, దగ్గుబాటి సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమా నక్సలిజం నేపధ్యంలో వస్తోన్న సినిమా. ఇందులో ప్రియమణి కామ్రేడ్ భారతక్క గా జరీనా వాహబ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా కు వేణు ఉడుముల దర్శకత్వం వహిస్తున్నారు.ఇక రానా సినిమా కావడం సాయి పల్లవి ఉండడంతో సినిమాపై ఆసక్తి కలిగింది.ఇక సినిమా నుండి విడుదలైన టీజర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

కరోనా రావడంతో లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్లన్ని ఆగిపోవడంతో విరాట పర్వం కూడా ఆగిపోయింది. ఇక కరోనా తరువాత మళ్ళీ సినిమా షూటింగ్స్ ఊపందుకున్న విరాట పర్వం సినిమా ఊసు ఎక్కడ వినిపించలేదు.ఈ సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తి కూడా దాదాపుగా సన్నగిల్లింది.ఇక రానా భీమ్లా నాయక్ లో డానియల్ శంకర్ గా పవన్ తో పోటీ పాడి నటించాడు.

విరాట పర్వం విడుదల మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఈ చిత్రం ప్రస్తావన ఎక్కడా వినిపించడం లేదు. ఒకప్పుడు సినిమాకున్న క్రేజ్‌ కూడా ఇప్పుడు లేదు. ఇప్పటికీ సినిమాకు బిజినెస్‌ కాలేదని వినికిడి. రానాకు ఉన్న పరిచయాలతో ఇటీవల సోనీ లైవ్ ఓటీటీకి డిజిటల్‌ హక్కులు అమ్మారు. కానీ థియేటర్‌ రైట్స్‌, శాటిలైట్‌ హక్కులు ఇంకా గాల్లోనే ఉన్నాయని వినికిడి. నిర్మాత డి.సురేశ్‌బాబు థియేటర్‌ విడుదల చేయడానికి అంతగా ఇష్టపడడం లేదని సమాచారం. సినిమా వెనుక సురేష్‌బాబు లాంటి నిర్మాత ఉన్నప్పటికీ ఈ చిత్రం ఓ కొలిక్కి రాకపోవడంపై చర్చలు జరుగుతున్నాయి. విరాట పర్వానికి అడ్డంకులు ఎపుడు తొలగుతాయో మరీ.