అఖిల్ కి జంటగా స్టార్ హీరోయిన్ ఫిక్స్… ఎలా ఒప్పించారో ..?

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత భాస్కర్ ఈ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే అఖిల్ కి జంటగా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ అండ్ టీజర్ తో అలాగే అఖిల్ – పూజా హెగ్డే జంట మీద బాగా క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

New poster of Most Eligible Bachelor featuring Akhil Akkineni, Pooja Hegde  out - regional movies - Hindustan Times

కాగా ఈ సినిమాలో ఉన్న లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా సక్సస్ అఖిల్ తో పాటు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కి చాలా కీలకం. అయితే ప్రస్తుతం ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని కంప్లీట్ చేస్తున్నట్టు సమాచారం. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అఖిల్ ఈ సినిమా సక్సస్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు.

Rashmika Mandanna to turn producer! - tollywood

ఇక ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తన 5వ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 బ్యానర్స్ పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా రష్మిక మందన్న ని హీరోయిన్ గా ఎంచుకున్నట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా రానుందని అంటున్నారు.