ప్రభాస్ సలార్ కోసం యష్ ని పరుగులు పెట్టిస్తున్న ప్రశాంత్ నీల్..?

ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ .. డార్లింగ్ ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, తో పాటు వైజయంతీ మూవీస్ నిర్మించబోతున్న నాగ్ అశ్విన్ సినిమా ను చేస్తున్నాడు. కాగా మూడు పాన్ ఇండియన్ సినిమాలు చేయాల్సి ఉండగానే తాజాగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న” సలార్ ” అన్న పాన్ ఇండియా సినిమాని ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా ప్రభాస్ – ప్రశాంత్ నీల్ ..ఎన్.టి.ఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఎట్టకేలకి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చారు.

KGF: Chapter 2's Official Teaser Will Not Be Out on Yash's Birthday,  Filmmaker Prashanth Neel Apologises to Fans (View Tweet) | 🎥 LatestLY

ఇక సలార్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతుండగా కెజీఎఫ్ నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. కాగా ప్రభాస్‌ని అత్యంత ధైర్యవంతుడైన ప్రతినాయకుడిగా ఈ సినిమాలో చూడబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించాడు. అంతేకాదు సలార్ సినిమా కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయడంతో ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి.

First look poster of Prabhas 'Salaar' is out - CINEMA - CINE NEWS | Kerala  Kaumudi Online

కాగా ఈ సినిమా షూటింగ్‌ను 2021 జనవరిలో మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం యష్ తో చేస్తున్న కెజిఎఫ్ ఛాప్టర్ 2 ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ సాగుతోంది. ఈ షెడ్యూల్ లో యష్ – సంజయ్ దత్ పాల్గొంటున్న క్లైమాక్స్ సీన్స్ కి తెరకెక్కిస్తున్నాడట. ఈ డిసెంబర్ వరకు ఈ సినిమా కంప్లీట్ చేసి జనవరి నుంచి ప్రభాస్ తో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాడు. ఇక కెజీఎఫ్ 2 సమ్మర్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే సలార్ ని 2022 లో రిలీజ్ చేయబోతున్నారు.