క్రిష్ – పవన్ కళ్యాణ్ సినిమా ఖచ్చితంగా ఆలస్యం అవుతుందా ..?

క్రిష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. పీరియాడికల్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాక్విలిన్ ఫెర్నాండస్ ఒక హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 27 వ సినిమాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి విరూపాక్ష అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా మొదలు పెట్టి 15 రోజులు షూటింగ్ జరిగిందో లేదో లాక్ డౌన్ వచ్చి పడింది. దాంతో పవన్ కళ్యాణ్ కమిటయిన సినిమాల షెడ్యూల్స్ అన్ని మారిపోయాయి.

ముందుకుగా కమిటయిన వకీల్ సాబ్ డిలే కావడం ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ ని కమిటవడం వల్ల ఆ ప్రభావం క్రిష్ -పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ మీద గట్టిగా పడింది. అయితే లాక్ డౌన్ తర్వాత క్రిష్ – పవన్ కళ్యాణ్ సినిమానే సెట్స్ మీదకి రావాలి. అంతేకాదు వకీల్ సాబ్ తర్వాత కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే క్రిష్ సినిమాతోనే పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కాని మధ్యలో పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం చేసేందుకు కమిటయ్యాడు. అంతేకాదు క్రిష్ సినిమాకి ముందు ఆ సినిమాని పూర్తి చేయాలని డిసైడయ్యాడు.

పవన్ కళ్యాణ్ ఇలా డిసైడవడానికి కారణం క్రిష్ సినిమా భారీ క్రూ తో తెరకెక్కే పీరియాడికల్ సినిమా కావడమే. ఈ సినిమాకి షూటింగ్ డేస్ కూడా ఎక్కువ కేటాయించాల్సి వస్తుండటం తో ముందు అయ్యప్పనుం కోషియం రీమేక్ ని కంప్లీట్ చేయాలనుకున్నాడట. ఈ కారణంగా క్రిష్ సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో ఏప్రిల్ లేదా మే నుంచి మొదలవనుందని సమాచారం. ఇక రిలీజ్ కూడా ఈ ఏడాది చివరిలో ఉండే అవకాశం ఉందంటున్నారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుం కోషియం రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజాగా రానా కూడా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. త్రివిక్రం దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటం విశేషం.