సూపర్ స్టార్ అని కూడా చూడకుండా మహేష్ ని ఇబ్బంది పెడుతున్న పరశురాం..?

సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ పేరుకు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మహేష్ కోసం పూరి జగన్నాధ్ రాసిన ‘ సూర్య భాయ్ అంటే పేరు కాదు ఇట్సే బ్రాండ్’ అన్న డైలాగ్ మాదిరిగా యావత్ ఘట్టమనేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒక బ్రాండ్ ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభం లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు. ఇక తాజాగా సర్కారు వారి పాట అన్న సినిమాలో నటించబోతున్నాడు.

సర్కారు వారి పాట`కు వరుస షాక్‌లు ఇస్తున్న మహేష్! | Mahesh Babu Sarkar Vaari  paata Movie Update

సొంత బ్యానర్ జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకోసం కీర్తి బల్క్ డేట్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం. కాగా దాదాపు 40 రోజుల భారీ షెడ్యూల్ ని విదేశాలలో ప్లాన్ చేశారు మేకర్స్. నవంబర్ నుంచి సర్కారు వారి పాట ని మొదలుపెట్టబోతున్న మేకర్స్ ఇప్పటికే యూఎస్ వెళ్లి లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారట.

ఈ ఫారిన్ షెడ్యూల్ లో రెండు పాటలు కొన్ని కీలక సన్నివేశాలని కంప్లీట్ చేసే విధంగా దర్శకుడు పరశురాం షెడ్యూల్ ప్లాన్ చేయగా ఆ తర్వాత పెద్ద గ్యాప్ లేకుండానే ఇండియాకి తొరిగొచ్చి కేవలం వారం గ్యాప్ లో మళ్ళీ కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మెదలు పెడతారట. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో బ్యాంక్ సెట్ ని సిద్దం చేసినట్టు సమాచారం.

సూపర్ స్టార్ అన్న పేరు ని కాస్త కూడా పట్టించుకోకుండా దర్శకుడు, యూనిట్ సభ్యులతో కలిసిపోయే మహేష్ బాబు ఈ సినిమా కంప్లీట్ చేసేందుకు చాలానే శ్రమించబోతున్నాడట. మహేష్ ని కొత్తగా చూపించేందుకు కొత్త మేకోవర్ తో స్క్రీన్ మీద మెస్మరైజ్ చేసేందుకు దర్శకుడు పరశురాం కూడా బాగా కష్టపడుతున్నట్టు సమాచారం. ఇక మహేష్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ పరశురాం కి మొదటిసారి వచ్చిందని ఈ అవకాశం ఎలా ఉపయోగించుకోబోతున్నాడో అని మాట్లాడుకుంటున్నారు.