కొత్త రుచి మరిగిన నాని.!

‘దసరా’ సూపర్ హిట్‌తో నానిలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. తన నుంచి రాబోయే తదుపరి నాలుగైదు సినిమాలూ కొత్త దర్శకులతోనే చేయాలని నాని అనుకుంటున్నాడట.

‘దసరా’ సినిమా తర్వాత ఆల్రెడీ ఓ కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసి పెట్టాడు నాని. ‘నాని 30’ అంటూ ఈ సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ కథతో ఈ సినిమా రాబోతోందని ఆ గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు.

ఇది కాక, మరో నాలుగైదు కథలు, అవీ కొత్త దర్శకులు చెప్పిన కథలు నాని విన్నాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. ‘దసరా’ ఇచ్చిన ఊపుతో ఆ నాలుగైదు కథలను ఫైనల్ చేసి ఒక్కొక్కటిగా పూర్తి చేసే యోచనలో వున్నాడట.

త్వరలోనే వాటిపై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ కొత్త కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది. 100 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట నాని.

ఇక, ‘దసరా’ విషయానికి వస్తే, 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు తీస్తోంది ఈ సినిమా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.