పాన్-ఇండియా వద్దంటోన్న చిరంజీవి.!

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేశారు. కానీ, నార్త్‌లో ఆ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఇక, ‘గాడ్ ఫాదర్’ సినిమా పరిస్థితి కూడా దాదాపు అంతే. సల్మాన్ ఖాన్ నటించినా, నార్త్ ఆడియన్స్ లైట్ తీసుకున్నారు.

అందుకే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికైతే ‘పాన్ ఇండియా’ ఆలోచనలే చేయడంలేదు. తాజాగా, ఓ యంగ్ డైరెక్టర్ పాన్-ఇండియా సబ్జెక్ట్‌తో చిరంజీవిని అప్రోచ్ అయితే, ఆయన సింపుల్‌గా ‘నో’ చెప్పేశారట.

ప్రస్తుతానికైతే ‘భోళాశంకర్’ రిలీజ్ కోసం చిరంజీవి ఎదురుచూస్తున్నారు. మరోపక్క, తన తదుపరి సినిమాని త్వరలో ప్రారంభిస్తారు చిరంజీవి. కుమార్తె సుస్మిత నిర్మాతగా తెరకెక్కున్న సినిమా అది. చిన్న కుమార్తె శ్రీజ కూడా ఆ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోనుంది.

జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట ఇది. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకుడు. పాన్-ఇండియా సినిమా చేయాలని మనసులో వున్నా, మార్కెట్ పరిమితుల నేపథ్యంలో, చిరంజీవి రీజినల్ సినిమాకే పరిమితమవ్వాల్సి వస్తోంది.