Mahesh: రాజమౌళి సినిమా కోసం త్రివిక్రమ్ కు డెడ్ లైన్ పెట్టిన మహేష్ ….?

Mahesh: స్వయం వరం సినిమాతో రచయిత గా సినీ రంగ ప్రవేశం చేసిన త్రివిక్రమ్ తన పదునైనా మాటలతో మాటల  మాంత్రికుడు  గా  అభిమానులలో పేరు సంపాదించాడు. తరుణ్ నటించిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.అయితే అతడు, జల్సా,  జులయ్, అత్తారింటికి దారేది, అలా వైకుంఠ పురంలో, అరవింద సమేత వంటి సినిమాలతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ల లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్నాడు.కానీ మహేష్ ఈ సినిమా కోసం డెడ్ లైన్ పెట్టినట్టు సమాచారం.

ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా మొదటి సారి నటిస్తోంది.అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ని కూడా విడుదల చేసారు.ఇక తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో చేయాల్సి ఉండగా ఆ సినిమా ను త్వరగా కంప్లీట్ చేయాలనీ మహేష్ చిత్ర యూనిట్‌కు టైమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా ఆ సినిమాకు డెడ్ లైన్ పెట్టడానికి కారణం ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి తో ఒక సినిమా ను కమిటీ అవ్వడమే. రాజమౌళి సినిమా కంప్లీట్ అవ్వడానికి ఎలాగో ఆలస్యంగా అవుతుందని అంతలోపు త్రివిక్రమ్ సినిమా రిలీజ్ చేయాలనీ మహేష్ ఫిక్స్ అయ్యాడట. అందుకే మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని మహేష్ సూచించాడట. త్రివిక్రమ్ కూడా అందుకు అంగీకరించినట్టు సమాచారం.