Mahesh Babu : మెగాస్టార్, రామ్ చరణ్ తో పాటు ఆచార్య సినిమా కోసం మహేష్ బాబు కూడా రంగం లోకి దిగుతున్నాడా..?

Mahesh Babu : ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్ మహేష్బాబు ఎంటర్ టైన్ మెంట్స్ కలసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కీర్తి సురేష్ మొదటి సారి మహేష్ బాబు సరసన జోడిగా నటిస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ రాజమౌళి సినిమాలు లైన్ లో పెట్టినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం మహేష్ బాబు గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమాలోని ముఖ్యమైన పాద ఘట్టం ప్రాంతానికి సంబంధించి విషయాలను మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ప్రారంభించాలని చిత్ర బృందం ఆలోచిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయ్. కొరటాల శివ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించినట్టు సమాచారం.

అయితే ఆచార్య సినిమా విడుదల సమయం కూడా దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లలో మొదలుపెట్టింది. ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు అన్న విషయంపై ఇంకా వివరాలు తెలియదు.