కృతి శెట్టి కి సాయి పల్లవి తో పోటీనా… ఇదేంటయ్యా..?

కృతి శెట్టి ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తోంది. కేవలం 17 ఏళ్ళ వయసున్న ఈ యంగ్ బ్యూటీ ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో మెగా మేనల్లుడు హీరోగా నటించాడు. దర్శకుడు బుచ్చిబాబు తో పాటు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి ఫస్ట్ సినిమా. కాని ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలైపోయాయి. ఉప్పెన సక్సస్ ఈ ముగ్గురి లైఫ్ లో ఎప్పటికి చెక్కు చెదరకుండా నిలిచిపోతుంది.

is-krithi-shetty-a-competitor-for-sai-pallavi
is-krithi-shetty-a-competitor-for-sai-pallavi

ఇక కృతిశెట్టి డేట్స్ దొరకడం ప్రస్తుతం మేకర్స్ కి కష్టతరంగా మారిందట. ఉప్పెన సినిమా రిలీజ్ కి ముందే కృతి శెట్టి మరో రెండు సినిమాలు కమిటయింది. నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో శ్యాం సింగ్ రాయ్ తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రస్తుతం కలకత్తా లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు గనక సూపర్ హిట్ అయితే ఇక టాలీవుడ్ లో కృతిశెట్టికి తిరుగుండదని అంటున్నారు.

ఇదిలా ఉంటే నాని నటిస్తున్న శ్యాం సింగ్ రాయ్ సినిమాలో కృతి శెట్టి ..తనకి సీనియర్ హీరోయిన్ అయిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవితో పోటీ పడుతుందని అంటున్నారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ పరంగా గట్టిగా పోటీ పడుతున్నారట. సాయి పల్లవి ఇప్పటికే తన టాలెంట్ తో స్టార్ స్టేటస్ ని అందుకుంది. కృతి శెట్టి ఉప్పెన తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఇప్పుడు ఈ ఇద్దరు నాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఎవరికి ప్రేక్షకులు ఎక్కువ మార్కులు వేస్తారో చూడాలి. అయితే సాయి పల్లవి తో కృతి శెట్టిని కంపేర్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.