సర్కారు వారి పాట లో కీర్తి సురేష్ లేదా .. మహేష్ ఫ్యాన్స్ కి పెద్ద షాకే ..?

మహేష్ బాబు – పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ..14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ తో సర్కారు వారి పాట మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మహేష్ మేకోవర్ చూసినప్పటి నుంచి సర్కారు వారి పాట మరో పోకిరి సినిమా మాదిరిగా ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అని చెప్పుకుంటున్నారు.

Official: Keerthy Suresh on board for Sarkaru Vaari Paata

ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో ఉండాలని యూనివర్సల్ కాన్సెప్ట్ ని సిద్దం చేశాడు పరశురాం. కాగా తాజాగా ఈ సినిమాలో నటిస్తుందనుకుంటున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి సోషల్ మీడుయాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ముందు నుంచి సర్కారు వారి పాట లో కీర్తి సురేష్ మేయిన్ హీరోయిన్ గా నటిస్తుందని చెప్పొకొస్తున్నారు.

కాని ఇప్పటి వరకు మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించకపోయే సరికి సర్కారు వారి పాట లో హీరోయిన్ కీర్తి సురేష్ కాదన్న టాక్ మొదలైంది. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి నే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్సైందట. ఇప్పటికే సర్కారు వారి పాట కి కీర్తి డేట్స్ కూడా ఇచ్చిందని సమాచారం.

అంతేకాదు యూఎస్ వర్క్ పర్మిట్ కోసం చిత్ర యూనిట్ వీసా కూడా అప్లై చేశారని సమాచారం. అంటే ఇప్పుడు వస్తున్నవన్ని గాలి వార్తలే అని క్లారిటీ వచ్చినట్టే. నిజంగా సర్కారు వారి పాట లో కీర్తి లేదా అన్న న్యూస్ ఒక రకంగా మహేష్ ఫ్యాన్స్ ని కాస్త కగారు కూడా పెట్టిందట. ఇక ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.