ఆ సినిమాని ఒప్పుకోవడం వల్ల కీర్తి సురేష్ డేట్స్ అన్ని ఇప్పుడు తారుమారయ్యాయా..?

కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్. చేతిలో భారీ ప్రాజెక్ట్ ఉన్నాయి. గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా, అన్నాత్తే, రంగ్ దే సినిమాలు ఇప్పటికే మొదలై షూటింగ్ కూడా జరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ గనక లేకపోయి ఉంటే నితిన్ రంగ్ దే సినిమాతో పాటు మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ సినిమాలు దాదాపుగా కంప్లీట్ అయి ఉండేవని సమాచారం. కాని కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్స్ అన్ని దాదాపు 7 నెలలుగా నిలిచిపోయాయి. దీంతో కీర్తి కమిటయిన సినిమాల డేట్స్ అన్ని తారుమారయ్యాయి. ఇపుడు ఆ డేట్స్ ని సర్దుబాటు చేయడమే పెద్ద కష్టం.

Maheshbabu Sarkari Vari Pata First Look | #Mahesh | Parasuram | @Dot  Entertainment - YouTube

అయితే ఇప్పుడు ఇలాంటి సమస్య మరొకటి వచ్చిందని చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు – పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అన్న సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళనుందని వార్తలు వచ్చాయి. అందుకోసం మేకర్స్ అమెరికాలో లొకేషన్స్ ని ఫైనల్ చేశారని ఇక సెట్స్ మీదకి వెళ్ళడమే ఆలస్యం అని చెప్పుకున్నారు. 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో దాదాపు సగానికి పైగా సినిమా టాకీ పార్ట్ తో పాటు రెండు సాంగ్స్ ని కంప్లీట్ చేయాలని మేకర్స్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా యూనిట్ సభ్యులకి విసా సమస్య రావడంతో జనవరి వరకు సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం లేదని సమాచారం. దాంతో ముందు అనుకునట్టుగా ఈ సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేయాలన్న ప్లాన్స్ కూడా మారతాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కి జంటగా నటిస్తున్న కీర్తి సురేష్ డేట్స్ కూడా మళ్ళీ సర్దుబాటు చేయాల్సి వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి సర్కారు వారి పాటకి ఏదో ఒకరకంగా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.