గుణ శేఖర్ – రానా ల హిరణ కశిప లో అనుష్క శెట్టి ..?

రానా – గుణశేఖర్ ల క్రేజీ కాంబినేషన్ లో హిరణ్యకశ్యప సినిమా చేయబోతున్నట్లు గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని సురేష్ బాబు తో కలిసి గుణశేఖర్ దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగానే దాదాపు సంవత్సరం పాటు గుణ శేఖర్ ఈ సినిమాకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేశాడు. ఇంకా చెప్పాలంటే కొంత బడ్జెట్ కూడా ఇందుకు ఖర్చు చేశారు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడే కరోనా మహమ్మారి కారణంగా రిస్క్ చేయలేక ఈ సినిమాని నిలిపివేస్తున్నట్టు నిర్మాత సురేష్ బాబు అధికారంగానే వెల్లడించారు.

Rana-Gunasekhar's 'Hiranyakashapa' To Start Soon! - Tupaki English |  DailyHunt

దాంతో ఇక ఈ ప్రాజెక్ట్ ఉండదని అందరూ భావించారు. ఈ క్రమంలో శాకుంతలం పేరుతో గుణశేఖర్ ఒక పీరియాడికల్ సినిమాని స్వీయ నిర్మాణంలో రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా ఇచ్చాడు గుణ శేఖర్. త్వరలో ఈ సినిమా లో టైటిల్ పాత్రలో పోషించే హీరోయిన్ ని ప్రకటించబోతున్నారని సమాచారం. అయితే తాజాగా మళ్ళీ హిరణ్య కశిప ని సెట్స్ మీదకి తీసుకు రావాలని నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక రానాకు కూడా ఈ ప్రాజెక్టు ఒకరకంగా డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిదే. అందుకే ఈ సినిమాలో నటించడానికి చాలా ఎగ్జైటింగ్ గా కూడా ఉన్నాడట. కాగా ఈ సినిమాని 2021 లో ప్రారంభించి 2022 లో రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారట. అంతేకాదు ఇప్పుడు సురేష్ బాబు తో పాటు హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ కలిసి నిర్మిస్తారని సమాచారం.

Anushka Shetty gets nostalgic as 'Rudramadevi' completes 5 years: Mentions  Allu Arjun and Rana | Telugu Movie News - Times of India

అయితే ఈ సినిమా కి సంబంధించి మరో న్యూస్ బయటకి వచ్చిందట. రానా – గుణ శేఖర్ ల హిరణ్య కశిప లో అనుష్క శెట్టి కీలక పాత్ర పోషించడానికి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుణ శేఖర్ .. అనుష్క తో రుద్రమదేవి సినిమాని తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక అనుష్క రాణా కలిసి రుద్రమదేవీ సినిమాతో పాటు బాహుబలి సినిమాలో కూడా నటించారు. కాబట్టి రానా – గుణ శేఖర్ – అనుష్క కాంబినేషన్ లో హిరణ్య కశిప గనక వస్తే ఇండస్ట్రీ రికార్డ్ గా నిలవడం ఖాయమని అంటున్నారు.