అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలిసి ఇంత పెద్ద ప్లాన్ వేశారా ?

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా సాంగ్స్ పరంగా ఇంకా రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. నిజంగా ఒక సినిమా మ్యుజికల్ హిట్ అయిన సందర్భాలు ఎన్నో చూశాము. కాని ఈ రేంజ్ లో సినిమా వచ్చి సంవత్సరం కావస్తున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఆల్బం ఇంత సెన్షేషన్ ని క్రియేట్ చేయడం ఈ ఒక్క సినిమాకే దక్కంది. 2020 సంక్రాంతి బరిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సూపర్ స్టార్ మహేష్ బాబు పోటీ పడిన విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’.. అలాగే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలు నువ్వా నేనా అన్నట్లు బాక్సాఫీస్ బరి లో దిగాయి.

Ala Vaikunthapurramuloo movie review: Allu Arjun and Trivikram Srinivas  entertain us again | Entertainment News,The Indian Express

సినిమా రిలీజైన ఫస్ట్ డే నుంచే మాది ఇండస్ట్రీ హిట్ అంటే.. మాది ఇండస్ట్రీ హిట్ అంటూ పోటా పోటీగా పోస్టర్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి బరిలో నిలిచిన రెండు సినిమాలు ఎవరికి వారు ఆధిపత్యాన్ని చూపించినప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల..’ సినిమా దే హై రేంజ్ లో నిలిచింది. చివరిగా అల్లు అర్జున్ అల సినిమాని ఇండస్ట్రీ హిట్ గా డిసైడ్ చేశారు. అయితే మహేష్ బాబు కూడా తగ్గిందేమీ లేదు. సరిలేరు సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకునేలా చేశాడు.

అయితే ‘సరిలేరు నీకెవ్వరు’తో ఢీ కొని సక్సెస్ అయిన అల్లు అర్జున్.. ఈ ఇండస్ట్రీ హిట్ ను మళ్లీ మళ్లీ ఇండస్ట్రీకి గుర్తు చేయడానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తోందట. అందుకు కారణం ‘అల వైకుంఠపురంలో’ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా బన్నీ సెలెబ్రేషన్స్ చేస్తూ ఉండటమే. తాజాగా గీతా ఆర్ట్స్ ఆఫీసులో ”అల వైకుంఠపురంలో రీ-యూనియన్ బాష్” అంటూ బన్నీ అండ్ టీమ్ ఓ గ్రాండ్ పార్టీ ఎరేంజ్ చేశారు. ఈ పార్టీ కి అటెండ్ అవ్వడానికి ‘పుష్ప’ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ వస్తున్నాడట అల్లు అర్జున్. ఇక్కడ మహేష్ అండ్ టీమ్ కూడా ఏమాత్రం తగ్గకుండా ‘1 ఇయర్ ఆఫ్ సరిలేరు నీకెవ్వరు’ అంటూ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఏదేమైనా 2020 లో మళ్ళీ సూపర్ హిట్ సినిమాలు రాకపోవడం తో ఈ తంతు జరుగుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.