Akhil Akkineni :బాలీవుడ్ బడా బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన అఖిల్… ఇందులో నిజమెంత?

Akhil Akkineni : అఖిల్ సినిమాతో సినీ రంగప్రవేశం చేసాడు అఖిల్ అక్కినేని. మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ లాంటి పెద్ద డైరెక్టర్ తో లాంచ్ అయినా అఖిల్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

ఇక ఇటీవలే బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాను చాలా గ్యాప్ తర్వాత అఖిల్ చేసాడు. పూజహెగ్డే సరసన అఖిల్ నటించాడు.అయితే పాటలు బాగానే జనాలకు ఎక్కాయి. కానీ సినిమా మాత్రం బాక్సఫీస్ వద్ద పర్వాలేదనిపించినా అక్కినేని అభిమానులకు మాత్రం ఆ సక్సెస్ సరిపోలేదు.

ఇపుడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ మూవీ ని చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా లో అఖిల్ డిఫరెంట్ గా కనిపించబోతున్నడట. అది కాకుండా మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇప్పుడు అక్కినేని అభిమానులను సంతోష పరిచే విషయం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.

బాలీవుడ్ బడా నిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు. టాలీవుడ్ లోను ఈయన సుపరిచితుడే.బాహుబలి సినిమా ను బాలీవుడ్ కు పరిచయం చేసింది కరణ్ జోహారే. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా కు సహా నిర్మాత గా ఉన్నారు కరణ్ జోహార్. ఈ సినిమా ను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఇపుడు అఖిల్ అక్కినేని తో ఒక సినిమా ను ప్లాన్ చేస్తున్నాడట కరణ్ జోహార్. ఈ విషయం ఇపుడు అక్కినేని ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. ఇందుకు సంబందించిన నిర్మాణ పనుల గురించి చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడితో ఒక సినిమా ను కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నాడట ఈ సినిమా లో అఖిల్ నటిస్తున్నారని టాక్ మరీ ఈ వార్తల్లో నిజమేంతో వేచి చూడాలి