‘ఆచార్య’ గాయం వేధిస్తూనే వుందా.?

‘మృగరాజు’ అప్పట్లో చాలా పెద్ద డిజాస్టర్. అయినాగానీ, చిరంజీవి ఆ డిజాస్టర్‌ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన చిరంజీవి, ఫ్లాపులకు కుంగిపోతారని ఎలా అనుకోగలం.?

కానీ, ‘ఆచార్య’ పరిస్థితి వేరు.! అయితే, చిరంజీవి కొంత బాధపడినా, వెంటనే కోలుకున్నారు. కోలుకున్నట్టే కనిపిస్తున్నారా.? ఇంకా ఆ ఆవేదన అలాగే వుందా.? అంటే, భిన్న వాదనలున్నాయి.

‘ఆచార్య’ తర్వాత ‘గాడ్ ఫాదర్’ వచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌తో.. చిరంజీవికి బెంగ తీరిపోయింది.! కానీ, ‘ఆచార్య’ ఏడాది పూర్తి చేసుకున్న దరిమిలా, సోషల్ మీడియాలో మళ్ళీ షురూ అయిన ట్రోలింగ్ వల్ల చిరంజీవి ఒకింత బాధపడ్డారట.

ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ఈ దుష్ప్రచారంపై సన్నిహితుల వద్ద చిరంజీవి వాపోతున్నారట. కొన్ని గాయాలు అంతే.. మానిపోయినా, బాధపెడుతుంటాయ్ మరి.!